లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

57చూసినవారు
లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ లాభాల్లో ట్రేడింగ్‌ అవుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 500 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 23,500పైన ప్రారంభమైంది. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 488 పాయింట్ల లాభంతో 77,675 వద్ద.. నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 23,509 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, టాటా, అదానీ పోర్ట్స్‌, తదితర కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

సంబంధిత పోస్ట్