దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 232 పాయింట్లు కుంగి 79,696 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు తగ్గి 24,127 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉండగా.. హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.