మంత్రి ఫరూక్ కుమారుడిపై రాళ్ల దాడి

54చూసినవారు
మంత్రి ఫరూక్ కుమారుడిపై రాళ్ల దాడి
మంత్రి ఫరూక్ కుమారుడు, టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్‌పై దాడి జరిగింది. కర్నూలు జిల్లాలోని నంద్యాల టీడీపీ కార్యాలయం నుంచి ఫిరోజ్ కారులో వెళ్తుండగా.. నలుగురు యువకులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దుండగులను పట్టుకునేందుకు ఫిరోజ్, ఆయన అనుచరులు ప్రయత్నించారు. మణికంఠరెడ్డి అనే యువకుడి పట్టుకోగా.. మిగిలిన ముగ్గురు పారిపోయారు. మణికంఠను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్