దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లు ఖాళీగా ఉంచకూడదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. దీని కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసి సూచనలు, అభిప్రాయాలు తీసుకోవాలని తెలిపింది.