అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఆ రాష్ట్రంలోకి అక్రమ వలసదారులు పెరిగిపోయారు. ఈ క్రమంలో అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించి వేయాలని పలువురు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చిన విదేశీయుల్ని ప్రభుత్వం నిర్బంధ కేంద్రాల్లో ఉంచడంపై మండిపడింది. వలసదారులను వెంటనే స్వస్థలాలకు పంపించాలని ఆదేశించింది.