పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఇప్పటి వరకు రెండు పతకాలు సాధించింది. షూటింగ్లో భారత్కు మరో పతకం ఖాయంగా కనిపిస్తోంది. 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్లో స్వప్నిల్ కుషాలే ఫైనల్స్కు చేరుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ముందంజ వేసింది. ఒలింపిక్స్లో ఈ విభాగంలో ఫైనల్కు చేరిన తొలి భారత షూటర్గా రికార్డు సృష్టించాడు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఫైనల్ జరగనుంది.