AP: వైఎస్ జగన్, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏప్రిల్ 17వ తేదీన తిరుమలకు రావాలని టీడీపీ ఛాలెంజ్ విసిరింది. ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వీ గోశాలలో 100 గోవులు మృతి చెందాయని అన్నారు. పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చి గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో చూడాలని కళ్లారా చూడాలని టీడీపీ ఎక్స్లో ట్వీట్ చేసింది.