AP: ఏలూరు జిల్లా, ముసునూరు మండలం చెక్కపల్లి చైతన్య పాఠశాలలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారి చదవటం లేదని ఉపాధ్యాయుడు విచక్షణా రహితంగా కొట్టాడు. అన్నవరం గ్రామానికి చెందిన డోలా వైష్ణవి (4) పాఠశాలలో LKG చదువుతోంది. అమ్మమ్మ స్వగ్రామమైన ముసునూరు మండలం వలసపల్లి నుంచి స్కూల్కు వెళ్తుంది. అయితే చిన్నారి బాగా చదవటం లేదని కోపంతో టీచర్ కొట్టాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.