పీఎస్ఎల్వీ - సి61 ప్రయోగంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్యలు వచ్చాయి. మరికాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో అధికారులు తెలిపారు. కాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీహరి కోట నుంచి 101వ రాకెట్ ప్రయోగం చేపట్టింది. భూ పరిశీలనకు చెందిన ఈఓఎస్-09(రీశాట్-1బి) ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకెళ్లింది.