AP: రాష్ట్ర రాజధాని అమరావతిలో కీలకమైన సచివాలయ టవర్ల నిర్మాణానికి రూ.4,668 కోట్లతో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. సచివాలయం కోసం 4 టవర్లు, హెచ్వోడీల కార్యాలయాల కోసం ఒక టవర్ మొత్తంగా ఐదు టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ బుధవారం టెండర్లు పిలిచింది. సచివాలయం టవర్లు 1, 2 కోసం రూ.1,897 కోట్లు, టవర్లు 3, 4 కోసం రూ.1,664 కోట్లతో టెండర్లు జారీ చేసింది. హెచ్వోడీల కార్యాలయం కోసం రూ.1,126 కోట్లతో ఒక టవర్ నిర్మాణం కోసం మరో టెండర్ను పిలిచింది.