AP: తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయన, వైసీపీ కార్యకర్తలతో కలిసి భూమన గోశాలకు ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని భూమన నిరసన తెలిపారు.