భారత్పై పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించి పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు కేంద్రం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతీ బృందానికి 7 ఎంపీలు నాయకత్వం వహించనుండగా, ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా ఒక బృందానికి నేతగా ఎంపికయ్యారు. అయితే, కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ పంపిన నలుగురు MPల లిస్ట్లో థరూర్ పేరు లేకపోవడం గమనార్హం. కానీ కేంద్రం ఆయనను సెలక్ట్ చేయడం విశేషం.