AP: గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ను కూటమి ప్రభుత్వం అందిస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలకు భరోసా ఇస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదే అని కొనియాడారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు వైద్యం అందని కారణంగా మరణించకూడదనేదే సీఎం చంద్రబాబు ఆశయం అని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.