ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. లేని విషయాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసి ఉద్యమంలా మారుస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్ను అప్రజాస్వామికంగా అభివర్ణించారు. గత ఘటనలపై కక్ష సాధించేందుకే చంద్రబాబు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. డిబేట్ల కోసం ఛానల్ యాజమాన్యాలే బాధ్యత వహించాలా? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.