ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పెన్షనర్లకు షాక్ ఇస్తోంది. పెన్షన్ లబ్ధిదారుల విషయంలో కోత పెడుతున్నారు. ఫిబ్రవరిలో ప్రభుత్వం మొత్తం పెన్షన్ లబ్దిదారుల సంఖ్యను 63,59,907గా ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 3 వరకు 62,43,436 మంది పెన్షన్ పొందినట్టు వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం ఇంకా దాదాపు 1,16,471 మందికి పెన్షన్ ఇవ్వలేదని తెలుస్తోంది. వివిధ కారణాలతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.