గోదావరికి వరదనీరు వచ్చిందంటే పులస చేపల సందడి మొదలవుతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక గంగపుత్రుల వలలో సుమారు కేజీన్నర బరువున్న పులస చేప పడింది. దీన్ని మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ.24 వేలు పెట్టి కొనుగోలు చేశాడు.