AP: ‘లక్కీ భాస్కర్’ సినిమాలో హీరో బ్యాంకు సొమ్మును వాడుకుని డబ్బులు సంపాదిస్తాడు. అదే తరహాలో డబ్బులు సంపాదించుకోవాలనుకున్న ఓ ఉద్యోగి పోలీసులకు అడ్డంగా దొరికాడు. మార్కాపురంలోని సచివాలయ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు పింఛన్ సొమ్ము రూ.2.66 లక్షలు తీసుకుని జనవరి 31న పారిపోయాడు. వివిధ బెట్టింగ్ యాప్లలో పెట్టి ఒక్క రోజులోనే రూ.10 లక్షలు సంపాదించాలనుకొని మొత్తం పోగొట్టుకున్నాడు. బంధువులు డబ్బు చెల్లించడంతో పోలీసులు అతడిని వదిలేశారు.