AP: డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ పోరంకిలో కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనతో తొలి అడుగు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం పెన్షన్ల కింద ఏడాదికి రూ.21 వేలు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదే రూ.34 వేల కోట్లు ఇచ్చిందన్నారు. వైసీపీ నాయకులు బటన్లు నొక్కామంటూ చెప్పకుంటున్నారని.. అందులో వారు నొక్కేసిందే ఎక్కవ అంటూ సెటైర్లు వేశారు.