రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మ ఆలయం చాలా ప్రత్యేకమైన దేవాలయం. పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుడు పుష్కర్ సరస్సు ఒడ్డున యజ్ఞం చేశాడని.. అలా యజ్ఞం చేసే సమయంలో సరస్వతి దేవి లేకపోవడంతో గాయత్రి దేవిని వివాహం చేసుకున్నాడని చెబుతారు. ఇంతలో అక్కడికి వచ్చిన సరస్వతి.. బ్రహ్మ దేవుడు చేసిన పనికి కోపగించి శాపం ఇచ్చిందట. అంతేకాక ఈ ఆలయంలోకి వివాహిత పురుషుడు వెళ్ళకూడదు. వెళితే దంపతుల మధ్య వివాదాలు వస్తాయని నమ్మకం.