తనపై వస్తున్న ఆరోపణలపై జనసేత నేత కిరణ్ రాయల్ తాజాగా స్పందించారు. అలాగే తిరుపతిలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. "గత వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టి అరెస్టు చేసి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని చోరీ చేశారు. ఆ డేటాతోనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మహిళను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయానికి భయపడేది లేదు. పదేళ్ల క్రితం ముగిసిపోయిన సమస్యను తీసుకొచ్చింది ఈ వైసీపీ" అని ఆయన మండిపడ్డారు.