ఏపీ లిక్కర్ స్కాం కేసులో తనకు సంబంధం ఉన్నట్లు చెప్పాలంటూ కూటమి ప్రభుత్వం అమాయకులనుపై కేసులు పెట్టి వేధిస్తోందని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. "APSPDCL మాజీ ఉద్యోగి బాలాజీని అక్రమంగా నిర్బంధించి.. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తోంది. వాటికి మేం భయపడం, అవి నిలవబడవు. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం" అని చెవిరెడ్డి అన్నారు.