మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి అటవీప్రాంతంలో పలువురు గ్రామస్థులు వేటకు వెళ్లారు. అనంతరం రెండు బృందాలుగా విడిపోయి వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఓ బృందం కదలికలను అడవి పందులుగా పొరపాటు పడి మరో బృందం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో తోటి వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.