రాజధానికి భూములిచ్చే వారికి కోరుకున్న చోట స్థలాలు ఇస్తాం: మంత్రి నారాయణ

58చూసినవారు
రాజధానికి భూములిచ్చే వారికి కోరుకున్న చోట స్థలాలు ఇస్తాం: మంత్రి నారాయణ
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్ర బాలెంలో భూసమీకరణలో భాగంగా రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. గ్రామంలో 10 మంది రైతుల నుంచి 10.37 ఎకరాలు తీసుకున్నారు. ల్యాండ్‌పూలింగ్‌ కింద భూములిచ్చే వారికి కోరుకున్న చోట స్థలాలిస్తామని చెప్పారు. తమని సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములు తీసుకుంటామని తెలిపారు. రాజధానిలో 17 నుంచి జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్