AP: మాజీ సీఎం జగన్కు మరో భారీ షాక్ తగిలింది. గ్రేటర్ విశాఖపట్నంలో ముగ్గురు వైఎస్సార్సీపీ మున్సిపల్ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో తిప్పల వంశీరెడ్డి, కుంచె జ్యోత్స్న, బెహరా స్వర్ణలతను పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. కాగా, ఇటీవల వైసీపీకి పలువురు కీలక నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.