AP: చిత్తూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామంలో టిప్పర్, టూవీలర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మహమ్మద్(28), బాబు(30)గా గుర్తించారు. రఫిక్ (25) అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.