AP: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన TDP పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. మహానాడులోపు పార్టీలోని అన్ని విభాగాల కమిటీలు భర్తీ చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. పద్మభూషణ్ గ్రహీత బాలకృష్ణను అభినందిస్తూ తీర్మానం చేసింది. పహల్గాం ఉగ్రదాడుల్లో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తిరంగా యాత్రలు చేపట్టాలని ఈ మేరకు నిర్ణయించుకుంది.