తిరుచానూరు ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీసుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో వేడుకగా అభిషేకం నిర్వహించారు.