తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో వేడుకగా శ్రీ సుందరరాజస్వామివారి ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, సూపరిటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.