వేడుకగా శ్రీసుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ

59చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో శ్రీసుందరరాజస్వామివారికి వేడుకగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చ‌కులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, ఏవిఎస్ఓ సతీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్