అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

65చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చిత్తూరు నగరంలోని ఇరువారం వద్ద అనుమానాస్పద స్థితిలో సోమవారం వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ముల్బాగల్ కు చెందిన రంజిత్ అనే వ్యక్తి ఇరువారం నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న వైన్ షాప్ దగ్గర మద్యంలో విషం కలుపుకొని తాగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్