చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో శనివారం సప్లిమెంటరీ ఇంటర్ పరీక్షలు చివరి రోజు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈఓ శ్రీనివాసులు తెలిపారు. ఫస్ట్ ఇయర్లో 5,600 మందికి గాను 510 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సెకండ్ ఇయర్ లో 1,467 మందికి 115 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు.