ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తప్పక నెరవేర్చాలని సిపిఐ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఏఐటియుసి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి కార్యకర్తలకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలని ఎఐటియుసి డిమాండ్ చేశారు.