జీడి నెల్లూరు నియోజక వర్గం, వెదురుకుప్పం మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలు మేరకు బ్రాహ్మణ పల్లికి చెందిన ఓ వ్యక్తిపై తలపై గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిళ్ళతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీనితో బాధితుడు వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.