గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ పై నియోజకవర్గంలోని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జీడీ నెల్లూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ ఛార్జ్ రాజేందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పెనుమూరులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి థామస్ అని కొనియాడారు. నియోజకవర్గంలోని సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారని అన్నారు.