గంగాధరం నెల్లూరు మండలం వేల్కూరు దళితవాడ గ్రామంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ జిడి నెల్లూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు సెంథిల్ కుమార్ పాల్గొని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి చేసిన సేవలు గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.