రామకుప్పం మండలంలో మంగళవారం మంచు దుప్పటి కమ్మేసింది. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో ఉదయం సమయంలోనే రోడ్లు కనిపించకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు పడ్డారు. మంచు కురిసే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించలేదు. ఈ సమయంలో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. అధిక మంచు ప్రభావం వాణిజ్య పంటలపై ఎక్కువగా పడుతుందని రైతులు తెలిపారు.