చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు కుప్పంకు శుక్రవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు తదితరులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించిన పనులు పురోగతి పై అధికారులతో చర్చించారు. త్వరతగతిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.