నగరి రూరల్ మండలం బుగ్గ అగ్రహారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్స్ కు విస్తృతస్థాయి సమావేశం ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏఐటియుసి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ ఆశా వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.