చిత్తూరు జిల్లా, నగరిలో టీడీపీ అరాచకాలు తారా స్థాయికి చేరాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేశారనే కారణంతో దళితులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. దళిత సంఘాలు ఏకమై కూటమి ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు. తడుకు ఘటన చూస్తుంటే కారంచేడు గుర్తుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.