పలమనేరు: విపత్తుల నిర్వహణ పై మాక్ డ్రిల్

58చూసినవారు
యుద్ధ నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి పలమనేరులో మాక్ డ్రిల్ నిర్వహించామని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ చెప్పారు. పట్టణంలోని జవళి వీధిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవేళ పాకిస్థాన్ మన దేశంపై ప్రతి దాడి చేస్తే ఆ సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో ఈ మాక్ డ్రిల్స్ ద్వారా అవగాహన కల్పించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు నరసింహ రాజు, మురళీ, ప్రసాద్, తహశీల్దార్ ఇన్భనాధన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్