వైద్యం వికటించడంతో పది నెలల చిన్నారి మృతి

66చూసినవారు
వైద్యం వికటించి పది నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి పుంగునూరు పట్టణంలో జరిగింది. మండల పరిధిలోని నక్కబండలో ఉండే వెన్నెల, సుబ్రమణ్యం దంపతుల కుమారుడు సాత్విక్ అనారోగ్యానికి గురి కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు ఇచ్చిన సిరఫ్ తాగించిన వెంటనే బాలుడు మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపించారు. బాలుడి మృతితో కుటుంబీకులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.

సంబంధిత పోస్ట్