పుంగనూరు నియోజకవర్గంలోని జూనియర్ కళాశాలలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని బసవరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని నియోజవర్గ ఇన్ఛార్జి చల్లా బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.