పుంగనూరు అర్బన్ 22వ వార్డు బెస్త వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో శుక్రవారం వైభవంగా పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిల విగ్రహానికి ఫల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకరించారు. ఆ ప్రాంతవాసులు, గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయంలో దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పించారు.