పుంగనూరు టౌన్ బెస్త వీధిలో శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిల విగ్రహానికి ఫల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకరించారు. ఆ ప్రాంతవాసులు, గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయంలో దీపాలను వెలిగించి అంబిలిని అమ్మవారికి సమర్పించారు.