పుంగనూరులోని యాభై రాళ్ల మరవ వద్ద వెలసిన శ్రీ శనేశ్వర స్వామికి శనివారం ఆలయ అర్చకులు పంచామృత అభిషేకం నిర్వహించారు. ముందుగా శని భగవానునికి రకరకాల సుగంధ ద్రవ్యాలతో గోక్షీరంతో అభిషేకం, దిపనైవేద్యాలు సమర్పించారు. శనేశ్వర స్వామి వారిని విశేషంగా అలంకరించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.