పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన ఘటన జరిగింది. ఎస్ఐ షేక్ షావలి కథనం మేరకు సదుం మండల సరిహద్దులోని అంకాలమ్మ కొండ సమీపంలో( 45) గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఉండగా ఆదివారం సాయంత్రం పశువుల కాపరులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.