జట్లకొండూరు మాజీ సర్పంచ్ పల్లం రెడ్డి పట్టాభిరామిరెడ్డి చనిపోవడం బాధాకరమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మండల పరిధిలోని జట్లకొండూరు గ్రామానికి విచ్చేసి పట్టాభి రామిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఉత్తరక్రియలలో పాల్గొని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.