పిచ్చాటూరు మండలంలోని ఆరనియార్ రిజర్వాయర్లో జూలై 01వ తేదీ నుండి ఆగస్టు 30 వ తేదీ వరకు చేపల వేట పై నిషేధిస్తూ తిరుపతి జిల్లా మత్స్య శాఖ అధికారి నాగరాజు శనివారం ప్రకటించడం జరిగింది. జూలై 1 నుండి ఆగస్టు వరకు మంచినీటి చేపలు సంతానోత్పత్తి జరుపుతాయి కాబట్టిచేపల వేట చేయకూడదన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంగించిన యెడల లైసెన్సులను రద్దుచేసి చర్యలు తీసుకుంటామన్నారు.