నాగలాపురం: వైభవంగా నందీశ్వరునికి అభిషేక పూజ

83చూసినవారు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా శనివారం నందీశ్వరునికి ప్రదోష అభిషేక ప్రత్యేక పూజ వైభవంగా జరిగింది. భక్తులు పూజా సామాగ్రిని కానుకలుగా సమర్పించారు. వివిధ రకాల పూలు, పండ్లతో నందీశ్వరుడిని సుందరంగా ముస్తాబు చేశారు. అర్చకులు ధూప దీప నైవేద్యాలు సమర్పించి, మహాహారతులు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్