నగరి నియోజకవర్గంలో శ్రీ వరసిద్ధి వినాయకునికి సోమవారం మహా కుంబాభిషేకంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు గురు రామచంద్ర శర్మ ప్రత్యేకంగా స్వామి వారిని అలంకరించారు మొదటి కాలం కలశ స్థాపన, గణపతి హోమం నిర్వహించారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురువులైన లోకేష్ దాస్ బృందముతో ఓంకార మంత్రాన్ని జపించారు. ఆలయ ధర్మకర్త భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.